TDP Vs YCP: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు

ABN , First Publish Date - 2023-08-24T10:53:41+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.

TDP Vs YCP: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) పాదయాత్రలో (YuvaGalam Padayatra) వైసీపీ (YCP) కవ్వింపు చర్యలకు పాల్పడింది. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(YCP MLA Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) ఫొటోలతో ఆ పార్టీ వర్గాలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కవ్వింపు చర్యలను పోలీసులు నియంత్రించని పరిస్థితి. వైసీపీ శ్రేణులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారంటూ తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నారు.


మరోవైపు గన్నవరం బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి, మంత్రి రోజా పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రిని నిలదీస్తే, పోలీసులకు అది తప్పుగా ఎలా కనిపించిందని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - 2023-08-24T10:53:41+05:30 IST