TDP: అగ్నిప్రమాద బాధితులకు దుస్తులు, కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2023-03-14T18:28:05+05:30 IST

వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు మంగళవారం టీడీపీ (TDP) నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో దుప్పట్లు, కూరగాయలు తదితరాలను అందజేశారు. కన్నాయిగుట్ట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ...

TDP: అగ్నిప్రమాద బాధితులకు దుస్తులు, కూరగాయల పంపిణీ

పోలవరం : వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు మంగళవారం టీడీపీ (TDP) నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో దుప్పట్లు, కూరగాయలు తదితరాలను అందజేశారు. కన్నాయిగుట్ట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో (Fire accident) సుమారు 27 ఇళ్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో వారంతా నిరాశ్రయులయ్యారు. దీంతో వారి సహాయార్థం బొరగం శ్రీనివాసులు కూరగాయలు, దుస్తులు (Vegetables and clothing) తదితరాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాద ఘటన బాధాకరమన్నారు. బాధిత కుటంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ap-news.jpg

ఈ కార్యక్రమంలో అంకన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం శేఖర్, టీడీపీ వేలేరుపాడు మండల అధ్యక్షుడు అమరావరపు అశోక్, విరాంకీ పాపారావు, రాజన్న వెంకటేష్, పాశం పండు, బుద్దుల అక్కమ్మ, ఉకే మంగమ్మ, శాఖమూరి సంజీవులు, గొంది నాగేశ్వరావు, కొమ్మన వెంకటేశ్వరరావు, కురిమెళ్ళ సుధాకర్, కొట్టిపల్లి ముత్యాలరావు, Sk. సలీమ్, అర్జ రాజు, సరియం మహేష్, కరుట్టురి రాధాకష్ణ, పునెం రామరావు, రెడ్లం కొండలరావు, బడేసే రాము నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-14T18:28:05+05:30 IST