Raghu Rama: గురువులు కూడా అమ్ముడుపోతే ఎలా..?

ABN , First Publish Date - 2023-03-13T16:34:29+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YCP) దొంగ ఓట్లు వేయిస్తోందని నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువు రాని వారితో కూడా ఓట్లు

Raghu Rama: గురువులు కూడా అమ్ముడుపోతే ఎలా..?
అమ్ముడుపోతే ఎలా..?

ఢిల్లీ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YCP) దొంగ ఓట్లు వేయిస్తోందని నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువు రాని వారితో కూడా ఓట్లు వేయిస్తున్నారు. విశాఖలో ఓ మహిళా మంత్రి ఆధ్వర్యంలో ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నారు. మావాళ్లు దోచుకున్నారు కాబట్టే ఇంధనంగా ఖర్చు పెడుతున్నారు. విద్య నేర్పే గురువులు అమ్ముడుపోతే ఎలా..?, జీతాలు కూడా ఇవ్వలేని పార్టీని గెలిపించుకుంటే ఎలా?, అవినాష్‌ను అరెస్ట్ చేస్తామని కోర్టుకు సీబీఐ (CBI) చెప్పింది. రేపు అరెస్ట్ అని సీబీఐ చెప్పేసింది. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని సీబీఐ తీసుకెళ్తే.. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది చూడాలి’’ అని రఘురామ సూచించారు.

Updated Date - 2023-03-13T16:34:29+05:30 IST