Share News

Nara Lokesh : సీఎం జగన్‌రెడ్డి మహిళలను మోసం చేశాడు

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:03 PM

జగన్ అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు.

Nara Lokesh : సీఎం జగన్‌రెడ్డి మహిళలను మోసం చేశాడు

విశాఖపట్నం: జగన్ అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. ఆదివారం నాడు పెందుర్తి నియోజకవర్గం పరవాడలో నారా లోకేష్‌ని డ్వాక్రా మహిళలు, కాపు సామాజికవర్గీయులు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...‘‘కాపు రిజర్వేషన్ల విషయంలో మాటతప్పి మడమతిప్పాడు. కాపు రిజర్వేషన్ల విషయంలో గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి, టీడీపీ కట్టుబడి ఉంది. కాపులకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:03 PM