Yuvagalam : బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి

ABN , First Publish Date - 2023-09-06T09:32:19+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు.

Yuvagalam : బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి

ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు. అర్ధరాత్రి మూడు వ్యానుల్లో యువగళం క్యాంప్ సైట్ కి చేరుకున్న పోలీసులు.. వలంటీర్లు, కిచెన్ సిబ్బంది, క్యాంప్ ఏర్పాటు చేసే సిబ్బందితో సహా మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి క్యాంప్ లోకి వచ్చి విచక్షణారహితంగా వలంటీర్లపై దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్ర కి అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసిపి కార్యకర్తలు కవ్వింపు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.

రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను, కవ్వింపు చర్యలకు స్కెచ్ వేసిన రౌడీ షీటర్ ఎన్ సుధని అరెస్ట్ చెయ్యకుండా యువగళం వలంటీర్లను అరెస్ట్ చెయ్యడం దారుణమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు సోడాలు, రాళ్లతో దాడి చేసిన వారిని వదిలి యువగళంపై జులుం ప్రదర్శించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దగ్గరుండి యువగళం పాదయాత్ర పై దాడి చేయించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి తరలి వస్తున్నారు.

Updated Date - 2023-09-06T09:32:19+05:30 IST