Share News

Yuvagalam: యువగళం ముగింపు సభకు వైసీపీ అడ్డంకులు

ABN , Publish Date - Dec 19 , 2023 | 11:03 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ ఈనెల 20వ తేదీన జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Yuvagalam: యువగళం ముగింపు సభకు వైసీపీ అడ్డంకులు

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ ఈనెల 20వ తేదీన జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. తెలుగుదేశం జాతీయ యువగళం ముగింపు సభకు వైసీపీ ( YCP ) అడ్డంకులు సృష్టిస్తోంది. సభకు ప్రజలు వెళ్లనీయకుండా వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. బస్సులు ఇవ్వడానికి ఇప్పటికే ఆర్టీసీ నిరాకరించింది. ప్రైవేట్ వాహనదారులకు బెదిరింపులు, ఆటోలపై వైసీపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. సభకు వెహికల్స్ ఇస్తే కేసులు పెడతామని పోలీసులు, ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు, అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేసి తీరుతామని టీడీపీ, జనసేన శ్రేణులు పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 11:03 PM