Rammohan Naiduరైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది
ABN , First Publish Date - 2023-11-14T18:09:18+05:30 IST
రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) అన్నారు.
శ్రీకాకుళం: రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘రైతులు పంటలు ఎండి కన్నీరు కారుస్తున్నారు అయినా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నుంచి ఒక్కరూ కూడా రైతు సమస్యలపై స్పందించడం లేదు. వర్షపాతం తక్కువ ఉంటుందని ముందునుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. పంట నష్ట పోకుండా రైన్ గన్స్, స్ర్పింకర్లు టీడీపీ హయాంలో ఏర్పాటు చేశాం. కరువు మండలాలను సైతం జగన్ ప్రభుత్వం ప్రకటించ లేదు. రైతును దగా చేస్తున్నారు తప్ప.. ఆదుకోవడంలేదు. పంట ఎండి నాశనమై పోతున్న పట్టించుకోవడం లేదు. ముప్పై శాతం వర్షపాతం తక్కువ వర్షపాతం ఉన్నా రాష్ట్రంలో 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. పంటలు ఎండిపోతుంటే ఇరిగేషన్, అగ్రికల్చరల్ మినిష్టర్లు ఏం చేస్తున్నారు. ఇరిగేషన్ మినిష్టర్.. రైతులపాలిట ఇరిటేషన్ మినిష్టర్గా మారారు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క కాలువ కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. కెనాల్స్లో పిడికెడు మట్టి కూడా పూడిక తీయలేదు’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వైసీపీ నేతలకు యాత్రలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: రామ్మోహన్ నాయుడు
‘‘టీడీపీ, చంద్రబాబుని తిట్టడం తప్ప.. మంత్రులు ప్రజలకోసం ఆలోచించడం లేదు. జగన్ వైఖరిని తితిలీ విధ్వసంలో చూశాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైయటకి వస్తారా..? వైసీపీ నేతలు బస్సు యాత్ర ఏందుకు చేస్తున్నారు. యాత్రల్లో కనీసం రైతులు గురించి మాట్లాడటం లేదు. ప్రచార ఆర్బాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద పట్టడం లేదు. జెండపట్టుకుని వెళ్తే చెప్పుతో కొట్టే పరిస్థితి ఉండటంతో అధికారులను ముందు పెట్టుకుని వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. సీఎం జగన్ 23వ తేదీన జిల్లాకు వస్తున్నారు.. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాకే ఇక్కడ అడుగుపెట్టాలి. ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉన్నా కనీసం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడి అందించాలి. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు ఏవిధంగా పెట్టించాలో ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదు. నేటికి సి ఐ డి స్కిల్ స్కాం డెవలప్మెంట్ కేసులో ఆధారాలు చూపించలేకపోతున్నారు’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.