Dharmana: చంద్రబాబు కంటే ముందే మనమే పేల్చాలి

ABN , First Publish Date - 2023-02-06T14:17:37+05:30 IST

వచ్చే యడాది మే 17 నాటికి పూర్తి స్థాయిలో వంశధార నీరు అందిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Dharmana: చంద్రబాబు కంటే ముందే మనమే పేల్చాలి

శ్రీకాకుళం: వచ్చే యడాది మే 17 నాటికి పూర్తి స్థాయిలో వంశధార నీరు అందిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasad Rao) అన్నారు. సోమవారం జిల్లాలోని గార మండలం సతివాడలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ధరలు అన్ని దేశాల్లో పెరిగాయన్నారు. తగాదాలు లేకుండా ఉండేలా భూ సర్వే చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాడానికి ఎదో ఒకటి చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్యలో పాలనకు జీవితం వేరు సినిమా యాక్షన్ వేరన్నారు. ఏది మంచి ప్రభుత్వమో చెప్పే హక్కు వలంటర్‌కు ఉందన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu) వస్తే మొదట తుపాకీ పేల్చేది వలంటర్‌లపైనే అని... చంద్రబాబు కన్నా ముందే మనం తుపాకీ పేల్చాలి అంటూ ధర్మాన పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T14:17:37+05:30 IST