Somireddy: తొక్కిసలాట వెనుక కుట్ర!

ABN , First Publish Date - 2023-01-03T14:23:56+05:30 IST

సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఆంక్షలు విధించడాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ

Somireddy: తొక్కిసలాట వెనుక కుట్ర!
కుట్ర!

నెల్లూరు: సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఆంక్షలు విధించడాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘‘రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టరాదన్న ప్రభుత్వ నిర్ణయం హేయం. స్వాతంత్య్రానికి ముందు ఉండి ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. రోడ్ల మీద కాక పొలాల్లో, గుంటల్లో, చెరువుల్లో నిరసనలు తెలపాలా.? నిరసనలు, సభలు, ర్యాలీలు చేసే హక్కు ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు వెనుక కుట్ర దాగుందన్న అనుమానం కలుగుతుంది. జగన్ నిర్ణయాలు చూస్తుంటే మన దేశంలో ఏపీ ఒక భాగమో.. కాదో అనే డౌట్ వస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో (Gujarat election) వేలాది మంది మధ్య సెక్యూరిటీని ప్రక్కన పెట్టి ఓటేసిన ప్రధాని (pm modi) కంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి? సీఎం ప్రజల్లోకి రాలేకపోతున్నాడని మిగిలిన వాళ్లను కూడా ప్రజల్లోకి వెళ్లకూడదంటే ఎలా? ముఖ్యమంత్రి (Cm jagan)కి ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh), టీడీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.’’ అని సోమిరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-01-03T14:24:46+05:30 IST