నెల్లూరు జిల్లాలో చకచకా మారుతున్న రాజకీయ పరిణామాలు..

ABN , First Publish Date - 2023-06-10T09:25:45+05:30 IST

నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు.

నెల్లూరు జిల్లాలో చకచకా మారుతున్న రాజకీయ పరిణామాలు..

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు. ఆయనకూ కూడా టీడీపీలోకి ఆహ్వానం పలకనున్నారు. ఈ నెల 13 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు వైసీపీకి చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి. అక్కడ వైసీపీ నేతలైన బాబాయ్, అబ్బాయ్ (ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్)ల మధ్య రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల వారిద్దరినీ కలిపేందుకు జగన్ యత్నించినా కూడా ఆ కాసేపు తలవూపి ఆ తరువాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ వర్గపోరు పార్టీకి చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో కీలక నేతలు ఆనం, కోటంరెడ్డిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు కోటంరెడ్డి, ఆనంలను టీడీపీ నేతలు కలుస్తున్నారు.

Updated Date - 2023-06-10T10:02:37+05:30 IST