MP Avinash Reddy : నేడు విచారణకు హాజరు కాలేను..
ABN , First Publish Date - 2023-03-16T09:51:53+05:30 IST
నేడు ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ మరోసారి విచారించాల్సి ఉన్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో మరోసారి విచారణ నిర్వహించాల్సి ఉంది. అయితే నేడు తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ : నేడు ఎంపీ అవినాష్రెడ్డి (YCP MP Avinash Reddy)ని సీబీఐ (CBI) మరోసారి విచారించాల్సి ఉన్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో మరోసారి విచారణ నిర్వహించాల్సి ఉంది. అయితే నేడు తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే అవినాష్ను సీబీఐ నాలుగుసార్లు విచారించింది. అవినాష్ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్లో పెట్టింది.
కీలక విషయాలు రాబట్టేందుకు అధికారుల యత్నం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ని రెండు రోజుల క్రితం సీబీఐ (CBI) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారు. సీబీఐ ఎస్పీ రామ్సింగ్ బృందంలోని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి సైతం కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.
విచారణకు హాజరు కాకుండా హైకోర్టుకు..
కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. అయితే అవినాశ్రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తన పిటిషన్పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం ఆదేశాలిచ్చారు. తన తీర్పును రిజర్వు చేశారు.