Share News

Minister Roja: 2024 జగన్ సీఎం అవుతారు.. ఆ ఇద్దరినీ పిచ్చాస్పత్రిలో చేర్చుతారు..

ABN , First Publish Date - 2023-12-09T16:11:41+05:30 IST

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు అండగా ఉంటానని చెప్పటం హాస్యాస్పదమన్నారు.

Minister Roja: 2024 జగన్ సీఎం అవుతారు.. ఆ ఇద్దరినీ పిచ్చాస్పత్రిలో చేర్చుతారు..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) మంత్రి రోజా (Minister Roja) మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు అండగా ఉంటానని చెప్పటం హాస్యాస్పదమన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్ రైతులను సకాలంలో ఆదుకుంటున్నారన్నారు. తెలంగాణతో ఆంధ్రాకు పోలిక లేదన్నారు. జగన్ సంక్షేమం అందిస్తున్నారన్నారు. గడప గడపకు మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2024 జగన్ ముఖ్యమంత్రి అవుతారని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిచ్చి ఆసుపత్రిలో చేర్చుతారంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-12-09T16:15:53+05:30 IST