Share News

Buddha Rajasekhara Reddy: వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టించాడు

ABN , First Publish Date - 2023-11-01T20:16:35+05:30 IST

వ్యవస్థలను మ్యానేజ్ చేసి సైకో జగన్‌రెడ్డి ఇన్నాళ్లు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టించారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ( Buddha Rajasekhara Reddy ) మండిపడ్డారు.

Buddha Rajasekhara Reddy: వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టించాడు

నంద్యాల: వ్యవస్థలను మ్యానేజ్ చేసి సైకో జగన్‌రెడ్డి ఇన్నాళ్లు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టించారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ( Buddha Rajasekhara Reddy ) మండిపడ్డారు. బుధవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘చంద్రబాబు నాయుడు బెయిల్‌పై రావడం శుభ పరిణామం. ఎమ్మెల్యే శిల్పచక్రపాణిరెడ్డి అవినీతి ఆరోపణలపై కరపత్రాల పంపిణీ ఎవరు వేశారో కానీ ఆ విషయం నిజమే. వైసీపీ నాయకులకే కడుపు మండి ఎమ్మెల్యే అవినీతిపై కరపతాలు పంపిణీ చేసినట్లున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీ పార్టీ అవినీతి బయటకు తీసి జైలుకు పంపడం ఖాయం. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు’’ అని బుడ్డా రాజశేఖరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-01T20:16:51+05:30 IST