BHUMA AKHILA PRIYA: వైసీపీ నేతలు రాయలసీమను మళ్లీ రాక్షస సీమగా మార్చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-08-05T19:30:32+05:30 IST

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(BHUMA AKHILA PRIYA) కీలక వ్యాఖ్యలు( comments) చేశారు. తనను నంద్యాల(Nandyala)కు వెళ్లవద్దని తెలుగుదేశం(Telugu Desham) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చెప్పలేదు తాను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నా, ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పారు.

BHUMA AKHILA PRIYA: వైసీపీ నేతలు రాయలసీమను మళ్లీ రాక్షస సీమగా మార్చేస్తున్నారు

నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(BHUMA AKHILA PRIYA) కీలక వ్యాఖ్యలు( comments) చేశారు. తనను నంద్యాల(Nandyala)కు వెళ్లవద్దని తెలుగుదేశం(Telugu Desham) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చెప్పలేదు తాను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నా, ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పారు. తనను రానివ్వకుండా చంద్రబాబుతో చెప్పించాలని కొందరు విఫలయత్నం చేశారన్నారు. పుకార్లను పట్టించుకోనని అన్నారు. నంద్యాల తన రక్తంలోనే ఉంది, దూరమయ్యే ప్రసక్తే లేదన్నారు. ఆళ్లగడ్డ(Allagadda)లో శిల్పా ఫ్యామిలీ(Shilpa family) కేసీ కెనాల్‌(KC Canal)ను పూడ్చివేసి వెంచర్‌ను వేశారన్నారు. శిల్పా ఫ్యామిలీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి(Prabhakar Reddy) కమీషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. పులివెందుల(Pulivendula)లో చంద్రబాబు పర్యటనకు వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పుంగనూరులో దాడి చేశారని ఆగ్రహ వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రాయలసీమను మళ్లీ రాక్షస సీమగా మార్చేస్తున్నారని అఖిల ప్రియ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-08-05T19:30:32+05:30 IST