Bhuma Akhila Priya: బొగ్గులైన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

ABN , First Publish Date - 2023-10-08T17:03:53+05:30 IST

నంద్యాల బొగ్గులైన్(Nandyala Coal Line) ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతమని మాజీ మంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.

Bhuma Akhila Priya: బొగ్గులైన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

నంద్యాల: నంద్యాల బొగ్గులైన్(Nandyala Coal Line) ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతమని మాజీ మంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు నంద్యాలలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడు బొగ్గులైన్ ప్రజలపై ఎమ్మెల్యే శిల్పారవికి ఎందుకు అంత ప్రేమ పుట్టిందో సమాధానం చెప్పాలి. బొగ్గులైన్ ప్రజలకు ఎమ్మెల్యే సొంత స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. కుందూనది పరివాహక ప్రాంతంలో పేదలకు ఎలా ఇళ్ల పట్టాలు ఇస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోటే స్థానిక ఎమ్మెల్యే ఇళ్లు కట్టుకొని నివాసం ఉండాలి. అభివృద్ధిపై ఎమ్మెల్యే శిల్పారవితో మాలో ఏవరైనా చర్చకు సిద్ధం. సమయం, స్థలం ఎమ్మెల్యే చెబితే రావడానికి మేం సిద్దంగా ఉన్నాం. వీకెండ్‌లో నంద్యాలలో ఉండడని ఎమ్మెల్యేను సండే ఎమ్మెల్యే అనే అంటారు. బొగ్గులైన్ ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదు’’ అని అఖిలప్రియ హెచ్చరించారు.

Updated Date - 2023-10-08T17:03:53+05:30 IST