Share News

Kollu Ravindra: జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు నష్టపోతున్నారు

ABN , First Publish Date - 2023-12-04T20:37:25+05:30 IST

జగన్‌ ప్రభుత్వ ( Jagan Govt ) నిర్లక్ష్యంతోనే తుపాన్‌కు రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) వ్యాఖ్యానించారు.

Kollu Ravindra: జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే  రైతులు నష్టపోతున్నారు

కృష్ణాజిల్లా(మచిలీపట్నం): జగన్‌ ప్రభుత్వ ( Jagan Govt ) నిర్లక్ష్యంతోనే తుపాన్‌కు రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) వ్యాఖ్యానించారు. బందరు మండలం గుండుపాలెం, చిన్నాపురం తదితర ప్రాంతాలల్లో కొల్లు రవీంద్ర పర్యటించారు. తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తుపాన్ ప్రభావంతో చేతికి అందివచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సకాలంలో కాలువల మరమ్మత్తులు చేయకపోవడం వల్ల పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. చేతికి అందివచ్చిన పంటను రైతులు కోల్పోవల్సి వచ్చిందని రవీంద్ర అన్నారు.

Updated Date - 2023-12-04T20:37:30+05:30 IST