Vishnu Kumar Raju : మద్యం డబ్బులతో అప్పులు తేవడం ఘోరం

ABN , First Publish Date - 2023-09-29T15:03:04+05:30 IST

మద్యం డబ్బులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అప్పులు తేవడం ఘోరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్టుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు.

Vishnu Kumar Raju : మద్యం డబ్బులతో అప్పులు తేవడం ఘోరం

విశాఖపట్నం: మద్యం డబ్బులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అప్పులు తేవడం ఘోరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్టుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పురంధేశ్వరిపై మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కల్తీ మద్యం ఏపీలో లేదన్నట్లు నారాయణస్వామి చెప్పడం హాస్యస్సదం, ఆశ్చర్యకరంగా ఉంది. మంత్రి నారాయణస్వామి జగనన్న మద్యం ఎప్పుడూ చూసి ఉండరు. అందుకే ఆయనకు చీప్ లిక్కర్ తెలియదు. మేము ఆడిటర్స్ కాదు.. కానీ ప్రజల ప్రాణాలు పోతే చూస్తూ ఊరుకునే చేతకాని వాళ్లం కాదు. మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి. మద్యం డబ్బులు ఏ ప్యాలెస్‌కు వెళ్తోంది?. మద్య షేదంపై సీఎం జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు’’ అని విష్టుకుమార్ రాజు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-29T15:45:49+05:30 IST