Home » Vishnu Kumar Raju
Andhrapradesh: విశాఖ గంజాయి, డ్రగ్స్కు రాజధానిగా మారిందని బీజేపీ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారన్నారు. గంజాయి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Andhrapradesh: పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటిస్తారన్నారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరపడిందని... ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎంకు లేదని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Andhrapradesh: దేశమంతా అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుక చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 22న రామమందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించారని... కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలు తర్వాత ఏపీ ప్రజలకు సుఖ సంతోషాలు వస్తాయన్నారుు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై.. జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడం ఖాయమని.. వైసీపీకి 20 సీట్లు మించిరావంటూ జోస్యం చెప్పారు.
ఇది వైసీపీ రౌడీ వెధవలు చేసిన పనే.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. బట్టలు ఊడదీసి... బూతులు తిట్టారు.. ఇది ఏమైనా మీ ప్రత్యేక రాజ్యమని అనుకుంటున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ సీఎం జగన్కు తెలియదని అంటున్నారని.. ఎవరిని మభ్యపెడతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు.. బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదన్నారు.
మద్యం డబ్బులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అప్పులు తేవడం ఘోరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్టుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు.
టీటీడీ ట్రస్టు బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. హిందూ మతం మీద విశ్వాసం లేని వారికి చోటు కల్పించారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్రస్టు ఒకటి పెట్టుకొని...అందులో మీకు నచ్చిన వారిని నియమించు కోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.