Venugopala Krishna : కులగణనపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది

ABN , First Publish Date - 2023-09-26T17:30:43+05:30 IST

కులగణనపై వైసీపీ ప్రభుత్వాని( YCP Govt) కి చిత్తశుద్ధి ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Venugopala Krishna) వ్యాఖ్యానించారు.

Venugopala Krishna : కులగణనపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది

అమరావతి: కులగణనపై వైసీపీ ప్రభుత్వాని(
YCP Govt) కి చిత్తశుద్ధి ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Venugopala Krishna) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కులగణన అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం శుభపరిణామం. సీఎం తీసుకున్న నిర్ణయం శాసనసభ చరిత్రలో నిలిచిపోతుంది. గత పాలకులు ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాలు చూసుకున్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు పథకాలు అందలేదు. కుట్రలు, కుతంత్రాలకు టీడీపీ, చంద్రబాబు ఒక వేదికలాగా మారాయి. కులగణనను మెచ్చుకోకపోయినా పర్వాలేదు. దయచేసి కుట్రలతో కులగణనను అడ్డుకోవద్దని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాలు సహకరించాలి. చరిత్ర పుటల్లో జగన్‌రెడ్డి నిలిచిపోతారు. బలహీన వర్గాల ఉద్యమాలకు ఈ రోజు అడగకుండానే దక్కిన ఫలం ఇది’’ అని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T17:30:43+05:30 IST