Kanna Lakshminarayana: ఓటమి భయంతో సీఎం జగన్‌కు మతిభ్రమించింది

ABN , First Publish Date - 2023-08-05T17:21:20+05:30 IST

జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు సభలకు ప్రజాధరణ పెరిగింది. లోకేష్ పాదయాత్రకు వెయ్యి రెట్ల ప్రజాధరణ పెరిగింది. చంద్రబాబు పర్యటనలో వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు.

Kanna Lakshminarayana: ఓటమి భయంతో సీఎం జగన్‌కు మతిభ్రమించింది

పల్నాడు: ఓటమి భయంతో సీఎం జగన్‌కు (CM Jagan) మతిభ్రమించింది అని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు సభలకు ప్రజాధరణ పెరిగింది. లోకేష్ పాదయాత్రకు వెయ్యి రెట్ల ప్రజాధరణ పెరిగింది. చంద్రబాబు పర్యటనలో వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తాం. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. 9న సత్తెనపల్లి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర. ఉదయం 8 గంటకు కోండమోడు నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం. సాయంత్రం 4 గంటలకు రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్‌లో లోకేష్ బహిరంగ సభ.’‌’ జరగనుందని కన్నా తెలిపారు.

Updated Date - 2023-08-05T17:21:20+05:30 IST