Sajjala: తోడేళ్ల మందలా ప్రతిపక్షాల దాడి.. సజ్జల వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-05-15T13:08:25+05:30 IST

సంపన్న కులాలకు ధీటుగా నిలబడే విధంగా జగన్ పేదలకు పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala: తోడేళ్ల మందలా ప్రతిపక్షాల దాడి.. సజ్జల వ్యాఖ్యలు

అమరావతి: సంపన్న కులాలకు ధీటుగా నిలబడే విధంగా జగన్ (AP CM Jagan Reddy)పేదలకు పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (YCP Leader Sajjala Ramakrishna Reddy)అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలో ఎన్నికలు జరుగనుండగ ప్రతిపక్షాలు తోడేళ్ల మందలాగ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అప్రమత్తంగా వుండాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 98.2 శాతం చెప్పిన హామీలు అమలు చేసిన ధీశాలి జగన్ (AP CM) అని అన్నారు. చంద్రబాబు (Chandrababu Naidu) ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలకు చిరునామ చంద్రబాబు (TDP Chief) కరకట్ట నివాసమన్నారు. హౌస్ రెంట్ అలవెన్స్ చంద్రబాబు తీసుకుంటున్నారని తెలిపారు. లింగమనేని రమేష్ తన గెస్ట్ హౌస్ ప్రభుత్వానికి రాసి ఇచ్చానవి చెబుతున్నారని... అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ అయితే చంద్రబాబు నివాసం ఉండేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదే అని నిలదీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ దందా చేసేవారు దీనిని సుప్రీంకోర్టు వరకు తీసుకవెళ్లారన్నారు. చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్ ఏ పాత్ర అయినా పోషిస్తున్నారని.. చివరకు కమ్యూనిస్టులు కూడా చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-15T13:08:25+05:30 IST