Payyavula Keshav: చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయి

ABN , First Publish Date - 2023-10-10T21:07:32+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైౌల్లో లోటు పాట్లు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.

Payyavula Keshav: చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయి

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైౌల్లో లోటు పాట్లు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబుని చూసి బాధగా ఉంది. ప్రత్యర్థులు మానసికంగా వేధించాలని చూసినా చంద్రబాబు దైర్యంగా ఉన్నారు. చంద్రబాబు తన గురించి, కేసులు గురించి ఆలోచించటం లేదు. కృష్ణా జలాలపై పోరాటం చేయాలని నాకు చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని చంద్రబాబు చెప్పారు. టీడీపీని ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను చూసి వైసీపీ భయపడుతోందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-10T21:07:32+05:30 IST