Share News

Venkaiah Naidu : ఈ ఎన్నికల్లో తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కావద్దు

ABN , First Publish Date - 2023-11-03T19:26:17+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నీతిగా, నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu ) తెలిపారు.

Venkaiah Naidu : ఈ ఎన్నికల్లో తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కావద్దు

తిరుపతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నీతిగా, నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu ) తెలిపారు. శుక్రవారం నాడుతిరుమలకు వెళ్తూ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అవినీతి అక్రమాలకు పాల్పడని వారిని ఈ ఎన్నికల్లో ఎన్నుకోండి. కులానికి, ధనానికి కాకుండా వ్యక్తి గుణానికి ఓటు వేయండి. తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కాకండి. అలా లోనైతే ఐదేళ్లు పాటు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దేవుడి సొమ్మును టీటీడీ హిందూధర్మిక సంస్థలకు వినియోగించాలి. పురాతన దేవాలయాల పునరుద్ధనకు స్వామి వారి ఆదాయాన్ని ఖర్చు చేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు.

Updated Date - 2023-11-03T19:26:18+05:30 IST