Share News

Chandrababu: 30న తిరుమలకు చంద్రబాబు

ABN , First Publish Date - 2023-11-29T17:14:08+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) 30వ తేదీ ( గురువారం) న తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లనున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్నారు.

Chandrababu:  30న  తిరుమలకు చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) 30వ తేదీ ( గురువారం) న తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లనున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకుని అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 12.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు.

Updated Date - 2023-11-29T17:45:48+05:30 IST