Share News

Atchannaidu: యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుంది

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:20 PM

యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు.

Atchannaidu: యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుంది

విజయనగరం: యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ‘‘భోగాపురం మండలం పోలిపల్లిలో ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే సభ ప్రారంభమవుతుంది. ఆర్టీసీకి అద్దె చెల్లిస్తాం బస్సులివ్వాలని ఏపీఎస్ ఆర్టీసీని అడిగితే స్పందన లేదు. ఏ వాహనం అందుబాటులో ఉన్నా వేదిక దగ్గరకు సకాలంలో కార్యకర్తలు, నేతలు చేరుకోవాలి. 2024 ఎన్నికల సమరానికి టీడీపీ, జనసేన సిద్ధమని శంఖారావాన్ని పూరిస్తాం. జగన్‌రెడ్డి దురాగతాలను తుదముట్టించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:20 PM