YuvaGalam: 53వ రోజుకు యువగళం పాదయాత్ర.. ఈరోజు లోకేష్ ఎవరెవరిని కలవనున్నారంటే...

ABN , First Publish Date - 2023-03-28T11:50:51+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 53వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది.

YuvaGalam: 53వ రోజుకు యువగళం పాదయాత్ర.. ఈరోజు లోకేష్ ఎవరెవరిని కలవనున్నారంటే...

శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం (TDP Leader Nara lokesh) పాదయాత్ర (YuvaGalam Padayatra) 53వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం (Penukonda Constituency)లో పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను మొదలుపెట్టారు. యువత నేత పాదయాత్ర (Padayatra)లో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొంటున్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని.. టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ లోకేష్ పాదయాత్ర (YuvaGalam)లో ముందుకు సాగుతున్నారు.

ఈరోజు పాదయాత్రకు ముందుకు సెల్పీవిత్ లోకేష్ (Selfy With Lokesh) కార్యక్రమంలో భాగంగా ప్రతీఒక్కరితో యువనేత సెల్ఫీలు దిగారు. ప్రతీరోజు సుమారుగా వెయ్యి మందికి యువనేత సెల్ఫీలు ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 661.4 కిల్లోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు పాదయాత్రలో భాగంగా పలువురితో లోకేష్ సమావేశంకానున్నారు. ఉదయం పాదయాత్ర మొదలైన వెంటనే బాలనన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతి నిర్వహించారు. ఆపై మల్లపల్లిలో ఇటుక తయారీ కార్మికులతో భేటీ కానున్నారు.

నేటి పాదయాత్ర వివరాలు...

మధ్యాహ్నం 12:30 గంటలకు పాలసముద్రం క్రాస్ వద్ద బీసీలతో ముఖాముఖి

1:30 గంటలకు పాలసముద్రం క్రాస్ వద్ద భోజన విరామం

2:35 గంటలకు పాలసముద్రం క్రాస్ వద్ద లాయర్లతో భేటీ

2:55 గంటలకు బెల్లాలచెరువు వద్ద స్థానికులతో మాటామంతి

సాయంత్రం

3:30 గంటలకు మిషన్ తండా వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ

6:50 గంటలకు నల్లగొండ్రాయనిపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ

రాత్రికి నల్లగొండ్రాయనిపల్లి విడిది కేంద్రం వద్ద బస

Updated Date - 2023-03-28T12:24:20+05:30 IST