ప్రియురాలి ఇంటికి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ఆ విషయం మర్చిపోమన్న తల్లి.. చివరకు..

ABN , First Publish Date - 2022-11-05T21:31:23+05:30 IST

తల్లిదండ్రులు చేసే తప్పులు.. ఒక్కోసారి పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా.. పిల్లల జీవితాలను కూడా సర్వనాశనం చేస్తుంటారు. పూణేలో..

ప్రియురాలి ఇంటికి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ఆ విషయం మర్చిపోమన్న తల్లి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులు చేసే తప్పులు.. ఒక్కోసారి పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా.. పిల్లల జీవితాలను కూడా సర్వనాశనం చేస్తుంటారు. పూణేలో (Pune) జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి తన కొడుకును ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని కొడుకు తల్లి దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఆమె పట్టించుకోవద్దని సర్దిచెప్పింది. దీంతో చివరకు కొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video: రైలు బోగీ దగ్గర ఈ పోలీస్ తిప్పలు చూడండి.. పాపం అటూ ఇటూ తిరుగుతూ..

మహారాష్ట్ర (Maharashtra) పూణె పరిధి లోహియానగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, 11ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఇటీవల ఆ వ్యక్తి.. భార్యకు తెలీకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయినా ఈ విషయంలో అతడి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు. అయితే అక్టోబర్ 11న అనుకోని ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంటికి వెళ్లే సమయంలో కొడుకును కూడా వెంట తీసుకెళ్లాడు. అయితే సదరు వ్యక్తి తన కొడుకును తీసుకురావడం.. అతడి ప్రియురాలు, ఆమె తల్లికి నచ్చలేదు.

పర్సు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసిన మహిళ.. అసలు విషయం తెలుసుకుని వణికిపోయిన పోలీసులు..

దీంతో బాలుడి పట్ల హేళనగా మాట్లాడడమే కాకుండా దుర్భాషలాడారు. దీంతో బాలుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇంటికి వెళ్లగానే ఇదే విషయాన్ని తన తల్లికి తెలియజేశాడు. అయినా ఆమె మాత్రం స్పందించలేదు. అ విషయం గురించి పట్టించుకోవద్దంటూ సర్దిచెప్పింది. కానీ బాలుడు మాత్రం తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయాడు. చివరకు అదే రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో పోలీసులు అత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు బుధవారం ప్రాథమిక విచారణ చేపట్టారు. చివరకు బాలుడి తండ్రి, అతడి ప్రియురాలు, ఆమె తల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఆ పని చేసిందని ఆరోపిస్తూ.. యువతిని రోడ్డు పైకి ఈడ్చుకొచ్చిన యువకులు.. అంతా చూస్తుండగా..

Updated Date - 2022-11-05T21:34:03+05:30 IST