Share News

Revanth Reddy: కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - May 03 , 2024 | 07:42 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి యూపీకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Revanth Reddy: కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport) నుంచి యూపీకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నామినేషన్ (Nomination) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌ (Hyderabad)కు వస్తారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ధర్మపురిలో జరగనున్న జన జాతర సభకు ముఖ్యమంత్రి హాజరయి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభలో పాల్గొంటారు. రాత్రి 6.30 గంటలకు ఉప్పల్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల నేడు

మళ్లీ జగన్‌ వద్దు!

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది

ఉద్యోగులకు.. జగన్ సర్కార్‌ దిమ్మతిరిగే షాక్!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 03 , 2024 | 07:45 AM