Home » Telangana » Hyderabad
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్ పరిధిలో అరగంట విద్యుత్(Power Supply Off) బంద్ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్సీ(లైన్ క్లియరెన్స్) ఇచ్చేందుకు విద్యుత్శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
వాహనాలను దొంగిలించటం చూస్తుంటాం.. అది రొటీన్ అనుకున్నాడేమో ఓ ఆకతాయి ఏకంగా ఎమ్మెల్యే కారు నంబర్ ప్లేట్నే కొట్టేశాడు. ఇంకేంటి ఆ నంబర్ ప్లేట్ను తన వాహనానికి తగిలించి చలాన్లు ఎగ్గొడుతూ కేటుగాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి ఎన్ని రోజులు ఉంటాడు..? అడ్డంగా బుక్ అయ్యాడు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada High Way) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ని అధికారులు గుర్తించారు.
Telangana: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో..
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
Telangana: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.