Home » LATEST NEWS
అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 7గంటల నుంచే పార్టీల నాయకులు బస్తీలు, కాలనీల మీద ప్రచార దాడిని సాగిస్తున్నాయి. ఉదయం ఆరు గంటల కల్లా కార్యకర్తలను పార్టీ కార్యాలయాలకు రప్పించి టిఫిన్లు పెట్టించి జెండాలను పట్టించి రంగంలోకి దింపుతున్నారు.
విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.
ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగమేదైనా ఉందంటే అది సాఫ్ట్వేరే(Software Field). లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా దాదాపు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో రుణాలు తీసుకుంటారు. అయితే లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ మరేదైనా లోన్ తీసుకోవాలంటే కస్టమర్లు మంచి CIBIL స్కోర్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ CIBIL స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే, మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కాగజ్నగర్లో జరగనున్న బీజేపీ వికాస సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొని ప్రసంగిస్తారు.
18వ లోక్సభ ఎన్నికలు(Lok Sabha elections 2024) దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇవి మొత్తం 7 దశల్లో జరుగుతుండగా, ఏప్రిల్ 19, 2024 నుంచి ప్రారంభమయ్యాయి. ఫలితాలు జూన్ 4, 2024న వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి కాగా, మూడో దశ ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.