Share News

Amit Shah: కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

ABN , Publish Date - May 05 , 2024 | 09:00 AM

ఆదిలాబాద్ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కాగజ్‌నగర్‌లో జరగనున్న బీజేపీ వికాస సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారు.

Amit Shah: కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

ఆదిలాబాద్ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కాగజ్‌నగర్‌లో జరగనున్న బీజేపీ (BJP) వికాస సంకల్ప సభ (Vikasa Sankalpa Sabha)లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) పాల్గొని ప్రసంగిస్తారు. కాగా ఈ బహిరంగ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆపార్టీ రాష్ట్ర నాయకులు బోనగిరి సతీష్‌బాబు, జడ్పీటీసీ అరిగెల నాగే శ్వరరావు, బీజేపీ జిల్లా కోకన్వీనర్‌ మయూర్‌ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి అధినాథ్‌, రాష్ట్ర మహిళామోర్చా నాయకురాలు సిద్దంశెట్టి సుహాసినితో కలిసి శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


ఆదివారం ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావని.. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. బీజేపీ గెలుపుకోసం అమిత్‌షా బహిరంగ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సత్య నారాయణ, ప్రసాద్‌గౌడ్‌, శ్రావణ్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఓటమి తధ్యం: తులసి రెడ్డి

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 09:04 AM