Home » Telangana » Adilabad
కాగజ్నగర్, మే 17: సికింద్రాబాద్-ఢిల్లీ వరకు మూడో ట్రాక్ పనులు మూడేళ్ల క్రితం ప్రారంభించినప్పటికీ పనుల్లో పురోగతి లేదు. దీంతో తరుచూ రైళ్లను రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్ రూరల్, మే 17: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభి వృద్ధి పనుల నిర్వహణలో అధికారులు బాధ్యతా యుతంగా వ్యవవహరిం చాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
కౌటాల, మే 17: కౌటాల గ్రామ పంచాయతీని గురువారం కేంద్ర భూగర్భగనులశాఖ, కేంద్ర జలసంఘం అధికార బృందం సందర్శించింది.
చింతలమానేపల్లి, మే 17: మండలంలోని కర్జవెల్లికి చెందిన అగాడి నారాయణ, మోహిని దంపతుల కుమార్తె స్ఫూర్తి ఈ నెల 15నుంచి 17వరకు నేపాల్లో ఇండియా, నేపాల్ మధ్య జరిగిన నేషనల్ సాఫ్ట్బేస్ బాల్ పోటీల్లో మంచిప్రతిభ కనబర్చి గోల్డ్ మోడల్ సాధించినట్లు తెలంగాణ సెక్రెటరీ దుర్గం గురువేందర్ తెలిపారు.
ఆసిఫాబాద్ రూరల్, మే 17: విద్యా ర్థులకు ఏకరూప దుస్తులను జూన్12వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ వెంక టేష్ దోత్రే అన్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో చదువుతున్న విద్యార్థులకు ఏక రూప దుస్తుల కోసం పంపిణీ చేసిన గుడ్డను జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా విద్యాధికారి అశోక్తో కలిసి పరిశీలించారు.
ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో పంట నష్టానికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఫసల్ భీమా పథకం మళ్లీ తెరపైకి వస్తోంది. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పంట బీమా పథకంపై విధివిఽధానాలు రూపొందించాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసి నప్పుడు రైతులు నష్టపోతున్నారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో 2 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కింద లబ్ధి చేకూరనుంది.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జోగాపూర్, చిత్తాపూర్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలని ఎంపీడీవో గంగ మోహన్ సూచించారు. శుక్రవారం ఐకేపీ కార్యాల యంలో టైలరింగ్ సెంటర్ ప్రారంభించి వారితో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం మంచిర్యాల జిల్లా కోకన్వీనర్ బాలసాని శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం జన్నారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో స్ధానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పిస్తామని ప్రకటించిందన్నారు.