Share News

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

ABN , Publish Date - May 05 , 2024 | 03:55 AM

(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది.

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

అమరావతి, రాజమహేంద్రవరం, ధర్మవరం, మే 4:(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ అగ్రనేతలు ప్రచారం కోసం రాష్ట్రానికి క్యూ కట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేడు బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో ధర్మవరం చేరుకుని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ప్రధాని మోదీ 6న రాజమహేంద్రవరం వస్తున్నారు. అక్కడ నుంచి కశింకోట వెళ్తారు. కాగా, రాజమహేంద్రవరంలో ప్రధాని విజయ శంఖారావం సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Updated Date - May 05 , 2024 | 07:12 AM