Share News

Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

ABN , Publish Date - May 05 , 2024 | 10:03 AM

విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.

Sujana Choudary:  వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

విజయవాడ: కూటమి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Choudary) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan) తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు. బుద్ధి ఉన్నవాళ్లెవరూ సమర్థించరని, వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. ప్రజల భూముల్ని కొట్టేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర పూరిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు (Land Titling Act)కు బీజేపీ మద్దతు ఉందని దొంగ ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘోరమైన చీకటి చట్టాలను తెచ్చి, జనం ఆస్తుల్ని దోచేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ అడ్డుకొని తీరుతుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 10:03 AM