Home » Vijayawada
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada High Way) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ని అధికారులు గుర్తించారు.
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇటు హైదరాబాద్, అటు బెజవాడలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. భాగ్యనగరంలో గంట పాటు వర్షం పడగా.. అటు విజయవాడలో మాత్రం వర్ష బీభత్సం కొనసాగుతోంది. బెజవాడలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఏపీలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఆ పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. వైసీపీ మూకలు ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్లు విసిరారు! పోలీసులే ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్లో 13 వరుసలు ఉండగా.. మొదటి 12 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, చివరిది నోటా. మొదటి నలుగురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా.. మిగతా 8 మంది రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానపార్టీ అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎంలో మొత్తం పది వరుసలు ఉండగా చివరిది నోటా.