Home » Andhra Pradesh » Krishna
ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలికి ఫ్యాక్చరవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి వేసిన ప్లేట్లను తీయించుకోవడానికి ఎంజే నాయుడు ఆస్పత్రికి వచ్చిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపరేషన్ వికటించి యువతి మృతిచెందిందని వైద్యులు అసలు విషయం చెప్పకుండా దాటవేసి తమను మభ్యపెట్టారని ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆమె తండ్రి డిమాండ్ చేశారు.
కృష్ణా విశ్వవిద్యాలయం డిగ్రీ ఆరో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితా లను ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి శుక్రవారం వెల్ల డించారు.
భర్త టీడీపీకి ఓటు వేశాడన్న కక్షతో ఉపాధి హామీ పథకం జాబితాలో నుంచి భార్య పేరు తొలగించిన ఘటన మండలంలోని గోళ్లమూడిలో జరిగింది.
‘‘ఎన్నికల్లో వైసీపీ పెనమలూరు అభ్యర్థి జోగి రమేశ్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. రెవెన్యూ అధికారులను, ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేష న్లకు ఎస్సైలను, పెడన నుంచి కొంతమందిని ఇక్కడకు బదిలీ చేయించుకున్నాడు. మైలవరం, పెడన, పటమటల నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చాడు. రౌడీషీటర్లు బట్ట అనిల్, కొత్తపల్లి రాజేష్, మరగాని అశ్విన్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. జోగి రమేశ్ ఆగడాలను అరికట్ట డంలో పెనమలూరు సీఐ విఫలమయ్యాడు. పెనమలూరు సీఐపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం.’’ అని టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్ అన్నారు.
కృష్ణాజిల్లాలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం ఆరు గంటల నుంచి 7గంటల వరకు భారీ వర్షం కురిసింది.
గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న కేసరపల్లిలోని ఈద్గా జమామసీదు వద్ద హజ్ యాత్రికుల కోసం ఈనెల 25వతేదీ నుంచి 30వతేదీ వరకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయా లని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
విజయవాడ రైల్వే డివిజన్ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్ క్వాడ్రలైన్ కాబోతోంది. విజయవాడ డివిజన్లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్) ట్రాక్ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను చేపట్టింది.
ఇసుక అక్రమార్కులు స్టాక్ యార్డులపై కన్నేశారు. కొద్దిరోజుల నుంచి స్టాక్ యార్డుల్లో ఇసుక దోపిడీ చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.3,500కు అమ్ముతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్కు శుక్రవారం పటమట పోలీసుస్టేషన్ ఎస్సై ఫోన్ చేశారు. ఒకసారి స్టేషన్కు రావాలని ఆదేశించారు. ఎందుకు రావాలని ప్రసాద్ ప్రశ్నించారు. మిమ్మల్ని బైండోవర్ చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారని సదరు ఎస్సై సమాధానమిచ్చారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదని, తనను ఏవిధంగా బైండోవర్ చేస్తారని, తాను స్టేషన్కు రానని ప్రసాద్ సమాధానం చెప్పడంతో సదరు ఎస్సై ఫోన్ పెట్టేశారు. ప్రసాద్ విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్కు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. గద్దె రామ్మోహన్ తరఫున కౌంటింగ్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించాల్సి ఉంది. దాడులు, ఘర్షణలకు ప్రేరేపిస్తారన్న అనుమానంతో ఆయన్ను బైండోవర్ చేయడం ఏమిటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్రసాదే కాదు.. జిల్లాలోని చాలామంది టీడీపీ నాయకులకు బైండోవర్ కాల్స్ చేసిన పోలీసులు.. వైసీపీ నాయకులకు మాత్రం మినహాయింపునిచ్చారు.