Share News

Hyderabad: ఉదయం 7 గంటలకే.. ప్రచార దాడి

ABN , Publish Date - May 05 , 2024 | 10:16 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 7గంటల నుంచే పార్టీల నాయకులు బస్తీలు, కాలనీల మీద ప్రచార దాడిని సాగిస్తున్నాయి. ఉదయం ఆరు గంటల కల్లా కార్యకర్తలను పార్టీ కార్యాలయాలకు రప్పించి టిఫిన్లు పెట్టించి జెండాలను పట్టించి రంగంలోకి దింపుతున్నారు.

Hyderabad: ఉదయం 7 గంటలకే.. ప్రచార దాడి

హైదరాబాద్‌ సిటీ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం(Morning) 7గంటల నుంచే పార్టీల నాయకులు బస్తీలు, కాలనీల మీద ప్రచార దాడిని సాగిస్తున్నాయి. ఉదయం ఆరు గంటల కల్లా కార్యకర్తలను పార్టీ కార్యాలయాలకు రప్పించి టిఫిన్లు పెట్టించి జెండాలను పట్టించి రంగంలోకి దింపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కల్లాపి చల్లే వేళ, ఓటర్లు పళ్లు తోముకుంటున్న సమయంలో వెళ్లి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇదెక్కడి చోద్యమంటూ విస్తుపోతుండడం ఓటర్ల వంతవుతోంది.

ఇదికూడా చదవండి: Rahul Gandi: తెలంగాణలో రెండు చోట్ల రాహుల్ బహిరంగ సభలు

ఇంటింటికి పార్టీ స్టిక్కర్లు అంటించడం మొదలు, ఓటర్లను కలుస్తూ.. తాము చేసే అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ గెలిపించాలని కోరుతున్నారు. ప్రత్యేక పాటలతో జానపద కళాబృందాలను రంగంలోకి దించి ముఖ్య కూడళ్లలో పాటలతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు ఇలా ఉదయం సాయంత్రం ప్రచారాలు చేసుకుంటున్నట్లు ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు.

దికూడా చదవండి: Amit Shah: కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

Read Latest Telangana News and National News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 10:16 AM