Home » Hyderabad
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
Telangana EAPCET Results Out: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా..
మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
హైదరాబాద్, మే 18: టీఎస్ఎప్సెట్(TS EAPCET Results) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు.
ముంబై స్టేషన్లో నాన్-ఇంటర్లాకింగ్ పనులు, 10, 11 ఫ్లాట్ఫాం యార్డుల విస్తరణ పనుల దృష్టా హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చే రైళ్లను దాదర్ నుంచే మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
మహానగరంలో ఎన్నికల విధులు(Election Duties) నిర్వర్తించిన సిబ్బందిలో కొందరు ఎదుర్కొన్న ఇబ్బందులివి. ‘గతంలో ఈ తరహా సమస్యలు ఎదురయ్యాయి.. మీరు సరైన ఏర్పాట్లు చేయరు.. మేం విధులకు రాము’ అని వినతిపత్రాలిస్తే.. ఇవేం కారణాలు.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. సస్పెండ్ చేస్తామని హడలెత్తించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కనీస వసతుల కల్పనను మాత్రం ఎప్పటిలానే పట్టించుకోలేదు.
డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
కార్యాలయాల్లో కాసేపు కునుకు తీయడం (పవర్ న్యాప్) ఇటీవలి కాలంలో చాలా కార్పొరేట్ కంపెనీలలో(Corporate companies) ఓ ట్రెండ్గా కొనసాగుతున్నది. నగరంలోని పలు ఐటీ, ఐటీయేతర కంపెనీలు తమ కార్యాలయాల్లో మధ్యాహ్నం పూట ఉద్యోగులు విశ్రమించడానికి సమయం ఇస్తున్నాయి.
టీఎస్ఎప్సెట్(TS EAPCET Results) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(జే–హబ్)(JNTU) ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎప్సెట్ కన్వీనర్ డీన్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఎన్టీయూ వైస్చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి ..
ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలపై కమిటీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ధరణిలో మొత్తం 119 తప్పలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ పేర్కొంది.