Home » BRS
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
మాజీమంత్రి మల్లారెడ్డిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా..? అందుకే వరసగా భూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారా..? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు.
వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులను ప్రోత్సహించటానికి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకుగాను ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతిపాదనలు తెప్పించుకొని, తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్సయాదవ్ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్హౌ్సలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.
మాజీ మంత్రి హరీశ్రావుకు హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు జూబ్లీహిల్స్లో అయిదెకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆయన 2008లో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు గోల్కొండ తాలూకా షేక్పేట్ గ్రామం సర్వే నెంబర్ 403లో ఎకరం రూ.8,500 చొప్పున అయిదెకరాల భూమిని కేటాయిస్తూ 2001లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 355 జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది.