Home » TG News
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
ముంబై స్టేషన్లో నాన్-ఇంటర్లాకింగ్ పనులు, 10, 11 ఫ్లాట్ఫాం యార్డుల విస్తరణ పనుల దృష్టా హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చే రైళ్లను దాదర్ నుంచే మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
మహానగరంలో ఎన్నికల విధులు(Election Duties) నిర్వర్తించిన సిబ్బందిలో కొందరు ఎదుర్కొన్న ఇబ్బందులివి. ‘గతంలో ఈ తరహా సమస్యలు ఎదురయ్యాయి.. మీరు సరైన ఏర్పాట్లు చేయరు.. మేం విధులకు రాము’ అని వినతిపత్రాలిస్తే.. ఇవేం కారణాలు.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. సస్పెండ్ చేస్తామని హడలెత్తించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కనీస వసతుల కల్పనను మాత్రం ఎప్పటిలానే పట్టించుకోలేదు.
కార్యాలయాల్లో కాసేపు కునుకు తీయడం (పవర్ న్యాప్) ఇటీవలి కాలంలో చాలా కార్పొరేట్ కంపెనీలలో(Corporate companies) ఓ ట్రెండ్గా కొనసాగుతున్నది. నగరంలోని పలు ఐటీ, ఐటీయేతర కంపెనీలు తమ కార్యాలయాల్లో మధ్యాహ్నం పూట ఉద్యోగులు విశ్రమించడానికి సమయం ఇస్తున్నాయి.
ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర అబ్రివియేషన్ను సూచించే ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని వినియోగించేందుకు కేంద్రం అనుమతి లభించింది. గత మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన అనుమతులు రాగా.. తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎ్సకు బదులుగా టీజీని వినియోగించేందుకు ఓకే చెప్పింది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ టికెటిస్తానని చెప్పి కేఏ పాల్ రూ.56 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కిరణ్కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ, ఇంకా పెండింగ్లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడుతారోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. పెంపునకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు, భవనాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెరుగుతుందనే విషయమై రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.
నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.