Home » Telangana » Rangareddy
హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ స్థానిక వక్ఫ్బోర్డు అధికారులకు సూచించారు. ఈనెల 16నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దర్గా పరిసరాలను డీసీపీ పరిశీలించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ ఆర్డీవోగా వెంకట ఉపేందర్రెడ్డి తిరిగి బదిలీపై రావడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రమాదవశాత్తు రెండు ఇళ్లకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని నాగారంలో శుక్రవారం జరిగింది.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు పూడూరు, మేడ్చల్ పరిధిలో చోటుచేసుకున్నాయి.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్నాయి. అధిక మొత్తంలో రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు.
సంవత్సర కాలంగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాయకులకు.. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకుల ఆశలకు జీవం పోసినట్లయింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లేడు చౌదరిగూడ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు.
వాహనాలు డ్రైవ్ చేసేవారు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, రూల్స్ తప్పక పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై చేవెళ్ల మండలంలోని ఆయా కంపెనీల వద్ద గురువారం డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
శంకర్పల్లిలోని మద్యం దుకాణంలో దొంగలుపడ్డారు. రూ.30వేల నగదు, రూ.10వేల విలువ గల మద్యాన్ని ఎత్తుకెళ్లారు. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి పట్టణంలోని సింగాపురం గేటు వద్ద వెస్టు సైడ్ అనే పేరుతో రఘునందన్రెడ్డి అనే వ్యక్తి మద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు.
నడుస్తున్న రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి మహబూబ్నగర్ నుంచి ఉందానగర్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు నుంచి జారి పడినట్లు తెలిపారు.