కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్పల్లిలో పెళ్లింట విషాదం నెలకొంది. రెండు రోజుల్లో కొడుకు వివాహం జరగాల్సి ఉండగా సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు తండ్రి దుర్గయ్య మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకోవడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సినీ ఫక్కీలో రెండు లక్షలు చోరీ ఘటన కలకలం రేపుతోంది. రషీద్ పటేల్ అనే వ్యక్తి బ్యాంక్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని బైక్పై వెళ్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మధ్య పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పులి ఉందన్న సమాచారం స్థానిక గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకులను ఢీకొట్టింది.
పసుపు రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన పసుపును కోతలు లేకుండా..
కొత్త రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న జెండాను ఆవిష్కరిస్తామని... అదే రోజు పార్టీ పేరును ప్రకటించనున్నట్లు కవిత వెల్లడించారు.
మద్యం మత్తులో ఒక వ్యక్తి కారును రాంగ్ రూట్లో నడిపి.. పలువురు గాయపడేందుకు కారణమయ్యాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగారం తండా గ్రామంలో పెద్దపులి ఇటీవల రెండు ఆవులను చంపేసింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.