ఓఈఆర్ పెరగటంతో వచ్చే నెల నుంచి కొత్త ధర అమలులోకి రానున్నాయి. టన్నుకు 500 రూపాయలకుపైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సత్తుపల్లిలో బీసీ బంద్లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.
దేశానికే ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణ రాష్ట్రం మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. తెలంగాణ గేమ్ ఛేంజర్గా ఆయిల్ పామ్ సాగవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే, రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్, తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
అన్నదాతలు ఆత్మ గౌరవంతో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉందని ఉద్ఘాటించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్గా మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మున్నేరు పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నందున ముందస్తూ.. చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.