తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చేసిన సూచనలపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) కిడ్నీ మార్పిడిలలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్గా గతంలో పని చేసిన వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని అతడికి సంబంధించిన 8 ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి తనిఖీలు చేపట్టారు.
తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గన్నీ బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి గాంజా స్మగ్లింగ్ యత్నం బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 10 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు, జవహర్నగర్, కాచిగూడ కేసుల్లో పరారీలో ఉన్న నేపాలీలను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది.
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.