హైదరాబాద్ పంజాగుట్టలో హైడ్రా మరోసారి తన మార్క్ చూపించింది. చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన మెట్ల మార్గాన్ని అధికారులు ఇవాళ తెరిపించారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..
మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష జరిపారు..
కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముహూర్తం ఖరారు చేశారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలికకు మద్యంతోపాటు గంజాయి తాగించి.. ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ తరలించారు.
హైదరాబాద్లోని చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు.