Home » YSRCP Cadre
బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని కడప చిన్నచౌకు పోలీసులు హైదారబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు.
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.
ఏపీ ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నారని విమర్శలు చేశారు. కనీసం ప్రెస్మీట్లో విలేకర్లు వేసే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్చల్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ను ధ్వంసం చేయించారు. ఆస్పత్రిని అప్పగించాలని దాదాపు 30 మంది రౌడీమూకలతో బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత బెదిరించినట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.
సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఏపీలో దొంగచాటుగా దొంగ మద్యం అమ్మించిన వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. దొంగ మద్యంలో కేసులో వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒక పేరు బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.
మచిలీపట్నం పోలీసులు యాక్షన్ చేపట్టడంతో మాజీ మంత్రి పేర్ని నాని దిగొచ్చారు. ఈ క్రమంలో పేర్ని నానితో సహా మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి క్యూ కట్టారు వైసీపీ నేతలు.