Home » West Bengal
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రతను అసెంబ్లీలోని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమబెంగాల్లోని విపక్ష తృణమూల్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు 59 మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణ గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేసుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్కు బుధవారంనాడు అందజేశారు.
తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ సంతకాలతో కూడిన లేఖను టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ స్పీకర్కు బుధవారంనాడు సమర్పించడం సంచలనమవుతోంది. రెబల్ వర్గం లేఖను స్పీకరించిన స్పీకర్ దీనిపై తన నిర్ణయాన్ని మధ్యాహ్నం 4 గంటలకు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. దాదాకు గతంలో ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరికి కుదిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కోల్కతాలోని ఓ కాలేజ్ యూనియన్ రూములో చెదలు పట్టిన నోట్ల కట్టలు వెలుగుచూశాయి. రెండు సూట్ కేసుల్లో దాచిన 100, 500 నోట్ల కట్టలను పనివారు గుర్తించారు.
పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్కతాలో ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. టీఎంసీలో కీలక నేతల తిరుగుబాటు మొదలైంది.
పశ్చిమబెంగాల్లో పదిహేనేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ఎన్నో అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి తృణమూల్ నేతలు, కార్యకర్తలు 'కట్ మనీ' పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి.
టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు.