Home » Weather
తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జోరు వాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా.. 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
భాగ్యనగరంలో వచ్చే మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
దక్షిణ, ఈశాన్య భారతంలో ఎక్కువ ప్రాంతాలకు వేగంగా విస్తరించిన అనంతరం రుతుపవనాల పురోగతి మందగించింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని అనేక ప్రాంతాలు ఇంకా రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలలో అసాధారణంగా దీర్ఘకాలం అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడకపోవడమే దీనికి కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. 2025 చివరిలో దిత్వా తుఫాను ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గుర్తించేస్థాయిలో తుఫాను వ్యవస్థ ఏమీ ఏర్పడలేదని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఎండలు, హీట్వేవ్ ప్రభావం కొనసాగుతోంది.
రెండు, మూడేళ్లకు ఒకసారి ఎల్నినో పరిస్థితులు ఏర్పడటం సర్వసాధారణమే అయినా.. ఈ సారి సూపర్ ఎల్నినో రానుందని, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మంగళవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.