Home » Warangal
Telangana: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మిర్చి పంట పొలంలో పులి అడుగులు గుర్తించిన రైతులు, కూలీలు తమ పనులను ఆపేసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఏకశిలా జూనియర్ కళాశాల (Ekashila Junior College) బాలికల క్యాంపస్లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ ( Intermediate) మెుదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి(Sridevi) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కొత్త రేషన్ కార్డులకు ఎట్టకేలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 18న అసెంబ్లీ అసెంబ్లీ లో బిల్లు పెట్టడం, కొత్త రేషన్ కార్డు కోసం దర ఖాస్తు చేసుకున్న వారికి సంక్రాంతి తర్వాత కార్డులు అం దిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
మందుబాబులు మోసానికి గురవుతున్నారు. మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరా చేసుకొని జిల్లాలోని కొన్ని బార్ అండ్ రెస్టా రెంట్ల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలోని 147 సంఘాలు ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎ్ససీపీఎ్సఈయూ)మాత్రమే సీపీఎస్ అంతమే పంతంగా ఉద్యమాలు చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు.
‘‘ఈ కాలంలో పుస్తకాలు చదివే ఓపికెవరికుంది అండి.! కొన్నాళ్లుపోతే అచ్చు పుస్తకాలను ఆర్కైవ్స్లో చూడాలేమో’’ లాంటి నిరాశ, నిస్పృహతో నిండిన వ్యాఖ్యానాలను తరుచుగా వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో మరో వందేళ్లు అయినా ‘పుస్తకం చిరంజీవి’ అన్న ఆశావాహాన్ని కల్పిస్తోంది
చారిత్రక ఆలయం కాలగర్భంలో కలుస్తోంది. ఆది మానవుల కాలం మొదలు కొని నేటి వర కు అనేక చారిత్రాత్మక ఆధారాలకు నిలయంగా ఉన్న మండలంలోని ఇప్పగూడెం గ్రామ శివారు లోని నాగేంద్రస్వామి (నాగులమ్మ ఆలయం) శిథిలవస్థకు చేరింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి మహర్దశ పట్టనుంది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ దవాఖాన మరో మైలురాయి దాటనుంది. ఇప్పటికే 12 రకాల సేవలు ఇక్కడ అందిస్తుండగా మరిన్ని అందుబాటులోకి రానున్నాయి.
ఏళ్ల కిందట సాదా బైనామాల రూపంలో భూములు కొనుగోలు చేసి వాటిని అనుభవిస్తున్నా వారి వద్ద సరైన రికార్డులు లేని కారణంగా ప్రభుత్వం వారిని పట్టాదారు రైతుల కింద గుర్తించ లేదు. సంవత్సరం క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి బిల్లు-2024ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టడంతో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలుగనున్నది.
ప్రెవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. కొందరు విచ్చలవిడిగా దందాను కొనసాగుతూ అప్పులు తీసుకున్న వారి రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అనేక మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు