Home » Vizag News
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార వైసీపీ (YSR Congress).. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. కూటమిని చీల్చడం వల్ల కాదని తెలుసుకున్న వైసీపీ.. ఇక టీడీపీలోని కీలక నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. వారిని పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే..
అన్ని పార్టీలు డబ్బులున్న వారికి, ఎన్ఆర్ఐలకు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులు పెట్టలేని తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారని.. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహరావు (MP GVL Narasimha Rao) అన్నారు. విశాఖ లోక్సభా టికెట్ తనకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది ఫోన్ చేస్తున్నారని తెలిపారు.
విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు.
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు.
సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్ను డ్రగ్గాంధ్రప్రదేశ్గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
తనపై సోషల్ మీడియాలో వైసీపీ (YSRCP) నేతలు విషప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. శనివారం నాడు సచివాలయంలోని సీఈఓ ఆఫీసుకు వచ్చారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25000 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం షాక్కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.
విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. బెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.