• Home » Vizag News

Vizag News

Constable: తుపాకీతో కాల్చుకుని ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Constable: తుపాకీతో కాల్చుకుని ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ ఒకరు గురువారం తుపాకీతో గుండెపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Vizag Drugs Case: ఢిల్లీ నుంచే ‘ఆపరేషన్‌ గరుడ’!

Vizag Drugs Case: ఢిల్లీ నుంచే ‘ఆపరేషన్‌ గరుడ’!

Vizag Drugs Case: విశాఖ తీరంలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. బ్రెజిల్‌ నుంచి షిప్‌ కంటెయినర్‌ ద్వారా విశాఖపట్నం పోర్టుకు దిగుమతి అయిన డ్రగ్స్‌ మూలాలు తెలుసుకోవడానికి ఒక బృందాన్ని బ్రెజిల్‌కు పంపినట్టు సమాచారం. విశాఖకు చెందిన ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ’ 25 వేల కిలోల ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ను ఆర్డర్‌ పెట్టగా... అది బ్రెజిల్‌ నుంచి మార్చి 16న విశాఖ పోర్టుకు చేరుకుంది.

AP Politics: దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతాం: విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్

AP Politics: దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతాం: విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్

విశాఖపట్టణం లోక్ సభ పరిధిలో కూటమి అభ్యర్థులు గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. విశాఖలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి వర్తించే విధంగా ఎజెండా రూపొందించామని ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు.

AP Politics: టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?

AP Politics: టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార వైసీపీ (YSR Congress).. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. కూటమిని చీల్చడం వల్ల కాదని తెలుసుకున్న వైసీపీ.. ఇక టీడీపీలోని కీలక నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. వారిని పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది..

AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!

AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే..

Laxminarayana: పార్టీలు వారికే టికెట్ ఇస్తున్నాయి.. లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Laxminarayana: పార్టీలు వారికే టికెట్ ఇస్తున్నాయి.. లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

అన్ని పార్టీలు డబ్బులున్న వారికి, ఎన్ఆర్ఐలకు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులు పెట్టలేని తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారని.. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

AP Politics: త్వరలోనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా..  ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

AP Politics: త్వరలోనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా.. ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహరావు (MP GVL Narasimha Rao) అన్నారు. విశాఖ లోక్‌సభా టికెట్ తనకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది ఫోన్ చేస్తున్నారని తెలిపారు.

AP News: విశాఖలో భారీగా ఈ సిగరెట్ల పట్టివేత

AP News: విశాఖలో భారీగా ఈ సిగరెట్ల పట్టివేత

విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు.

Dadi Veerabhadrarao: వారు విశాఖను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారు

Dadi Veerabhadrarao: వారు విశాఖను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారు

విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు.

Pranav Gopal: సీఎం జగన్ ఏపీను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారు

Pranav Gopal: సీఎం జగన్ ఏపీను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారు

సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి